Monday, January 28, 2019

స్మరణీయులు

▪️గంగుల శాయిరెడ్డి :(1890-1975) 

హలమే కలమై అక్షర సేద్యం చేసిన కాపుబిడ్డ.సాలు సాలును తన గుండె గొంతుకగా వినిపించిన మట్టిమనిషి. కృషీవలుడి తలపాగై వెలుగొందిన భూమిపుత్రుడు.ఓ రైతు గర్జన.ఓ సహిత్య స్పూర్తి.వీరి స్వస్థలం పూర్వ నల్లగొండ జిల్లా ఇప్పటి వరంగల్ జిల్లాలో భాగమైన జీడికల్లు గ్రామం.

▪️జి.పుల్లారెడ్డి (1921-2007)

గునమపల్లి పుల్లారెడ్డి ....మిఠాయిల వ్యాపారంతో స్వీట్ల పుల్లారెడ్డిగా ప్రఖ్యాతి గాంచాడు. 1948 లో కర్నూల్ లో చిన్న బండిమీద ప్రారంభం అయిన వీరి వ్యాపారం ' కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..' మాటను ఋజువు చేస్తూ ఈనాడు ప్రపంచస్థాయిని అందుకున్నది. వీరు అరెస్సెస్ ప్రముఖులు.హిందూనేత. సామాజిక కార్యకర్త.అంకితభావానికి  మారుపేరుగా ...క్రమశిక్షణకు అస్సలు పేరుగా...నిరాడంబరతకు నిజ రూపంగా ...వీరి జీవితం ఆదర్శప్రాయం.త్యాగం.. సేవ..కృషి...వీరి వ్యక్తిగత నిఘంటువులో మొదటి అక్షరాలు. వీరి స్వస్థలం కర్నూలు జిల్లా.

▪️హెచ్.ఎం. రెడ్డి (1892-1960)

వీరి పూర్తిపేరు హనుంతప్ప మునియప్పరెడ్డి. 1931లో తొలి తెలుగు మాటల సినిమా 'భక్త ప్రహ్లాద  'ను తెర మీదకు తీసుకు వచ్చిన సృష్టికర్త.కదిలే బొమ్మలకు మాటలు నేర్పిన   సినీమాంత్రికుడు.తొలి తెలుగు టాకీకి మాత్రమే కాదు...తొలి తమిళ టాకీ ' కాళిదాసు ' కు  కూడా ప్రాణం పోసిన మన రెడ్డిబిడ్డ.సినిమా మాటల చరితకు ఆద్యుడు.పులిమీసాల చిత్రగర్జన. వీరి స్వస్థలం బెంగుళూరు.

▪️బి.ఎన్.రెడ్డి (1908-1977)

వీరి పూర్తి పేరు బొమ్మిరెడ్డి నరసింహ్మారెడ్డి .తెలుగు  చిత్ర సీమలో ' మల్లీశ్వరి ' కళాఖండానికి ఊపిరిపోసిన మందారమాల.దర్శకుడిగా నిర్మాతగా కళామతల్లికి ఎనలేని సేవలు అందించి....దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రెడ్డికుల రతనం. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి వీరి స్వగ్రామం.

▪️బి.ఎన్ రెడ్డి (1912-2004)

వీరి అస్సలు పేరు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డికి స్వయాన తమ్ముడు.ఇద్దరు అన్నాదమ్ముళ్ళు బి.ఎన్ రెడ్డిలుగానే ప్రపంచానికి పరిచయం అయ్యారు. వీరు కూడా దర్శకుడు ..నిర్మాత. తెలుగు సినిమా ఆణిముత్యాలు 'మాయాబజార్ ' ' మిస్సమ్మ ' ' గుండమ్మ కథ 'లకు ప్రాణదాత. విజయవాహిని స్టూడియో  నిర్మించి ఎందరికో  బతుకుదెరువు చూపించాడు.వీరు మంచి వ్యాపారవేత్త.హైదరాబాదులో వున్న ప్రస్తుత 'బి.ఎన్ .రెడ్డి కాలనీ ' వీరి పేరు మీదిదే.

▪️నీలం సంజీవరెడ్డి (1913-1996)

భారత 6 వ రాష్టపతిగా పనిచేసిన రెడ్డిజాతి గర్వకారణం. వీరు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి, ప్రజల మన్ననలను పొందిన తిరుగులేని  రాజకీయవేత్త. వీరి స్వగ్రామం అనంతపురం జిల్లా ఇల్లూరు.

 ▪️✍️డా.తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

No comments:

Post a Comment