Monday, January 28, 2019

పోరాట వారసత్వం

కుర్రారం రామిరెడ్డి :

👊🏾 వీరుడా రామిరెడ్డి..
కుర్రారం కరవాలమా రామిరెడ్డి...!
ధీరుడా రామిరెడ్డి....
నల్లగొండ గుండె సప్పుడే నువ్వు రామిరెడ్డి...!
పౌరుశాల నడిగడ్డవే రామిరెడ్డి...
త్యాగాల ముద్దుబిడ్డవే రామిరెడ్డి...!🙏
17 .10. 1948  .
నిజాం నియంతృత్వపాలన నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ సాక్షిగా తెలంగాణకు విముక్తి లభించిన రోజు !ఇది విలీనమా? విమోచనమా? అంటూ సాహిత్యకారులు విమర్శకులు మేధావులు కొందరు లేవనెత్తారు.ఇది అప్రస్తుతం.కాగా విమోచనానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు ఒక రెడ్డిబిడ్డ పులిబిడ్డై రజాకర్ల మీద తెగబడ్డాడు.ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని ఒంటబట్టించుకున్న మన కాపుబిడ్డకు తెలంగాణ చరిత్రలో తగినంత ప్రాధాన్యత లేదు.ఇది బాధాకరమైన విషయం.గుత్ప ఎత్తితేనే చాలు వీరులుగా కొనియాడుతూ  జేజేలు పలికే తెలంగాణ ముద్దుబిడ్డల్లారా ఈ వీరుడిని మరిచారు ఎందుకు? మరుగున పడవేసారు ఎందుకు?
   నల్లగొండ జిల్లా భువనగిరి తాలూకా కుర్రారం గ్రామ వాస్థవ్యుడైన రామిరెడ్డి ఒక దొరబిడ్డ.విద్యావంతుడు.రైతు కుటుంబంలో ఉదయించిన తెలంగాణ అభిమన్యుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల వందేమాతరం పిలుపు అందుకుని తన చదువుకు స్వస్తి చెప్పి ఉద్యమంలోకి వెళ్ళాడు.  ఈ క్రమంలో అంధ్రమహాసభ ఆహ్వానంతో తెలంగాణ ప్రజా చైతన్యానికై నాయకత్వ బాధ్యతను భుజాన వేసుకుంటూ గెరిళ్ళా దళాలను రూపొందించి స్వయంగా శిక్షణలు ఇచ్చాడు.
   రామిరెడ్డి అంటే ఒక నడిచే వేల సైన్యం ! ఒక సింహస్వప్నం ! అతడి శక్తిని యుక్తిని పసిగట్టిన రజాకర్లకు అతడి పేరు చెబితేనే హడలు పుట్టేది. నియంతలైన దొరలకు గుబులు పుట్టేది.ప్రజాబంధువైన రామిరెడ్డి రజాకర్ల కదలికలపై ఓ కన్నేసి వుంచేవాడు.వాళ్ళను మప్పించి వాళ్ళ స్థావరాలపై దాడిచేసి వాళ్ళ ఆయుధాలను ఎత్తుకెళ్ళేవాడు.ప్రజలను పీడించే రజాకర్లు అంటే రామిరెడ్డి 'చంపడానికి అర్హమైనవాడు 'గా అర్థాన్ని మారుస్తూ...తనకు అదును దొరికి నప్పుడల్లా వాళ్ళతో పోరాటం చేసి మొత్తం 100 మందిదాకా రజాకర్లను మట్టుబెట్టాడు.ఇది అతడికి శతృవులను ఎంత పెంచిందో...ప్రజల అండదండలను కూడా అంతే పెంచింది.
  ఇట్లాంటి పరుస్థుతుల్లోనే రజాకర్ల నాయకుడు ఖాసిం రజ్వి మార్చి నెల 9,1948 నాడు  ఒక ప్రకటన చేసాడు.అది ఏందంటే ...భారత్ యూనియన్ లో హైదరాబాద్ చేరదని, అది స్వతంత్ర్యదేశంగా మనుగడ సాగిస్తుందని  ,ఒకవేళ బారత్ సైన్యం తమ ప్రకటనని బేఖాతరు చేస్తూ హైదరాబాద్ లోకి ప్రవేశిస్తే నరమేధం తప్పదు అని ! కాగా ఇది లెక్క చేయని భారత్ యూనియన్ సైన్యం సెప్టెంబర్ 13 .1948 నాడు హైదరాబాద్ లోకి ప్రవేశించింది.ఇది తెలిసి రజాకర్లు గ్రామాలపై విరుచుకుబడ్డారు.కనిపించిన వాళ్ళను కనిపించినట్టే కాల్చి పారేయసాగారు.కత్తులతో నరకసాగారు.ఇట్లాంటి పరిస్థితుల్లో మన రామిరెడ్డి ...రజాకర్ల కంచుకోట అయిన జనగామ దగ్గర వున్న నాగపురి స్థావరంపై దాడి నిర్వహించాడు.రామిరెడ్డి శక్తి తెలిసిన రజాకరులు  అతడిని ఎదుర్కోలేని పిరికి వాళ్ళయి  లొంగినట్టుగా  నటించారు.తర్వాత గోడ రంధ్రం లోంచి గురి చూసి రామిరెడ్డిని కాల్చే ప్రయత్నం చేసారు . రజాకర్ల కుట్రకు రామిరెడ్డు తొడల్లోకి తూటాలు దూసుకుపోయాయి.అయినా భయపడని రామిరెడ్డి రజాకర్లని ఎదుర్కునే ప్రయత్నం చేసాడు.వాళ్ళతో శక్తి కూడదీసుకుని పోరాడుతూ...వాళ్ళను చెదరగొడుతూ..కొడగండ్ల దాకా వెళ్తాడు.రక్తం దారెంబడి స్రవిస్తున్నా శతృవులకు చిక్కకూడదనే అతడి సంకల్పం అతడ్ని భీకరుడిగా మార్చింది..గాయపడీ సైతం పులిలా లంఘిస్తున్న రామిరెడ్డి విశ్వరూపం రజాకర్ల వెన్నులో వణుకు పుట్టించింది.దీంతో శతృవులకు  దొరక్కుండా తనని తాను కాపాడుకున్న రామిరెడ్డి... గాయాలపాలై కొడగండ్లలోనే ఉండిపోతాడు.అట్లా మూడురోజులు ఉంటాడు.అప్పుడే నిజాం భారత సైన్యానికి లొంగిపోతూ హైదరాబాదును భారతదేశంలో విలీనం చేస్తాడు.అట్లా తెలంగాణ ప్రాంతం స్వతంత్ర్య రాష్ట్రమయ్యిది.గాయపడిన రామిరెడ్డి చావుబతుకుల్లో ఉండగా భారత యూనియన్ మిలటరి చొరవ తీసుకుని హైదరాబద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి చేరుస్తుంది.కాని వీరుడు రామిరెడ్డి  సెప్టెంబర్ 18 న అమరుడయ్యాడు.అప్పుడు అతడి వయసు కేవలం 28 ఏండ్లు.
    ప్రజల కోసం  ...ప్రాంతం కోసం...అమరుడైన రామిరెడ్డిని మన తెలంగాణ ఉద్యమ కవులు పోరాటవారసత్వపు వరుసలో స్మరించక పోవడం అనేది రెడ్డి బంధువులు ఆలోచించాల్సిన విషయం.
కుర్రారం చుట్టు పక్కల ప్రజలు  మాత్రం నేటికినీ రామిరెడ్డిని కథల రూపంలో పాటల రూపంలో స్మరించుకుంటున్నారు. ఈ పాటల్ని సేకరించి రికార్డు చేయాల్సిన అవసరం కూడా ఎంతయినా ఉన్నది

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

No comments:

Post a Comment