Monday, January 28, 2019

కుప్పాంబిక (తొలి తెలుగు కవయిత్రి )

▪️కుప్పాంబిక (తొలి తెలుగు కవయిత్రి )

మగడి శక్తిని మించి గెలిచి....చరిత ఘనతకు ఎదురు నిలిచి....పౌరుషత్వం పొంగిపొరలగా....కదన రంగమున కత్తి దూసిరి.....కవన రంగమున కలము దూసిరి...పుణ్య భూమిలో ఈ ధీర మహిళలు పుట్టి గెలిచిరి.......

     తెలంగాణ ఆడబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ , కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా వెలుగులోకి వచ్చారు. ఈ విషయాన్ని  ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై తెలంగాణ సాహిత్య వైభవంలో భాగంగా చాటి చెప్పడం జరిగింది.
         సాహిత్య చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ వెలుగులోకి తెచ్చిన ఈ కుప్పాంబిక కాకతీయుల కాలం నాటి కవయిత్రి.తెలుగులో తొలి తెలుగు ద్విపద రామాయణం రాసిన గోన బుద్దారెడ్డి ముద్దుల కూతురు. రుద్రమకు చతురంగ బలమై వెన్నంటిన గోన గన్నారెడ్డి చెల్లెలు.కుప్పాంబిక భర్త గుండనాథుడు. భర్త మరణానంతరం బూదపురంలో ఈమె శివాలయాన్ని  'గుండేశ్వరాలయం ' గా నిర్మించింది.
     మహబూబ్‌నగర్ జిల్లాలోని ఈ బూదపూరం  (బుద్దాపురం)  వద్ద  క్రీ.శ. 1276లో తన భర్త చనిపోయినప్పుడు వేయించిన శాసనాన్ని బట్టి ఆమె 1230లో జన్మించినట్టుగా... తండ్రి నుంచి సాహిత్య వారసత్వం పొందినట్టుగా..., భర్త మల్యాల గుండనాథుని ఆస్థానంలోని కవుల స్ఫూర్తితో ఆమె సాహిత్యానికి మెరుగులు దిద్దుకున్నట్టుగా పరిశోధకులు భావిస్తున్నారు.ఆ బూదపూరమే ఇప్పటి  భూత్పర్.
         కృష్ణదేవరాయల  ఆస్థాన అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు సంకలనం చేసిన ఓ గ్రంథంలో కుప్పాంబిక పద్యం ఒకదాన్ని  పేర్కొనడాన్ని పరిశోధకులు గుర్తించారు.
       . బాల్యం నుంచి యవ్వనదశకు చేరుకున్న తనపై మన్మథుడు కురిపించే బాణాలు పెంచే మోహాన్ని తన స్నేహితురాళ్ళతో కూడా చెప్పుకోలేకపోవడం గురించి 13 వ శతాబ్దంలోనే  పద్య రూపంలో కుప్పాంబిక గొప్పగా రాశారు .
           అయ్యలరాజు సంకలనంలోని కుప్పాంబిక పద్యం ఇలా ఉంది   👇
   వనజాతాంబకుడేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక యౌవనంబు మదికిన్ ధైర్యంబు రానీయద
త్యనురక్తిన్ మి.ముబోంట్లకున్ దెలుప నాహా! సిగ్గుమైకోదు పా         
వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే
          ఇట్లా  16 వ శతాబ్దం నాటి మొల్ల....తాళ్ళపాక తిమ్మక్క....వీరిద్దరి కంటే రెండు వందల ఏండ్లకు ముందే కవిత్వం రాసిన కుప్పాంబికే తొలి తెలుగు కవయిత్రి .  ముఖ్యంగా తాళ్ళపాక తిమ్మక్క లేదా తాళ్ళపాక తిరుమలమ్మను తొలి తెలుగు కవయిత్రిగా తెలుగు సాహిత్యం  మొన్నటి వరకు పేర్కొనడం జరిగింది.వీరు తాళ్ళపాక అన్నమాచార్యుల వారిఇల్లాలు, మొదటి భార్య. ఈమె నన్నయ భారతము ఆధారముగా 1163 పాదాలతో సుభద్రా కల్యాణము అనే ద్విపద కావ్యము

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

No comments:

Post a Comment