Showing posts with label రెడ్డి కుల నిర్ణయ చంద్రిక. Show all posts
Showing posts with label రెడ్డి కుల నిర్ణయ చంద్రిక. Show all posts

Monday, April 15, 2024

రెడ్డి కుల నిర్ణయ చంద్రిక

ఎవరు బ్రాహ్మణులు ? ఎవరు క్షత్రియులు ? ఎవరు వైశ్యులు ? ఎవరు శూద్రులు ? అనే చర్చ ఇవాళ అవసరం లేదు . అయితే ఇవి కులాలుగా ప్రచారమవుతున్నాయి . ఇది తప్పుడు ప్రచారం . ఇవి కేవలం వర్ణాలు మాత్రమే . 
అని చెప్తున్న "రెడ్డి కుల చంద్రిక" నిజామాబాద్‌.... దోమకొండ సంస్థాన్ పాలకులచే పోషించబడిన ఒక అరుదైన చారిత్రక పుస్తకం. 

ఇటీవల సుందరాయ విజ్ఞాన కేంద్రం ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

యుగ ప్రసిద్దులైన.....
శేషాద్రి రమణ కవులు, పెద్దమందడి వెంకటకృష్ణకవి మొదలగు వారిచే రచింపబడింది.
మహాముని కావ్యకంఠ బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ అయ్యల సోమయాజులు గణపతి శాస్త్రి చేత ఇది పరిశోధించబడింది .
గోలకొండ ముద్రాక్షరశాలలో 1927లో మొదటి ముద్రితం .
నెల్లూరు జిల్లా ఇందుకూరు పేటకు చెందిన శ్రీమత్పరమహంస స్వామీజీ యన్ . బి . సరస్వతిగారు / శ్రీ మాడపాటి హనుమంతరావుగారు / శ్రీ గునుపాటి నవాది రెడ్డిగారు / శ్రీ తాటికొండ తిమ్మారెడ్డి గారు / శ్రీ కంఠీరవాచార్యులవారు /గద్వాల సంస్థానవిద్వాంసులు శ్రీ పుల్లగుమ్మి వెంకటాచార్యుల వారు / శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు/ డా || కట్టమంచి రామలింగారెడ్డిగారు / శ్రీ గుండేరావు హర్కారే గారు / తిరువణ్ణమలైకి చెందిన మహాకవి శ్రీ కావ్య కంఠగణపతి మునిగారు /ఈ గ్రంథానికి అభిప్రాయాలు వ్రాశారు . పీఠికలు సంతరించి పెట్టారు .

https://archive.org/details/ srirasthu-reddikula-nirnaya-cha ndrika http://www.sundarayya.org/ saraiirasatau-raedadaikaula-nai ranaya-camdaraika

పరిచయం : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి