Saturday, April 2, 2022

నిజాం రాజ్యం - వివరాలు

#నిజాం_రాజ్యం_వివరాలు 

( పరిశోధకులు -  ఔత్సాహికులు కోసం )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
సేకరణ : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

✔️నిజాం  ( అసఫ్ జాహీలు ) రాజ్యంలో   మరాఠ (మహారాష్ట్ర),  కర్ణాటక ప్రాంతాలు కూడా ఉండేవి. తెలుగు కన్నడ మరాఠీ ప్రాంతాల వారీగా  ఉర్దూ కలుపుకుని  నాలుగు  భాషలు  మాట్లాడే ప్రజలు  హైదరాబాద్ సంస్థానంలో ఉండేవారు.  
కన్నడ - మహారాష్ట్ర  - తెలంగాణ  ప్రాంతాలకు చెందిన మొత్తం 4 రెవెన్యూ డివిజన్లు, 16 జిల్లాలు  సంస్థానంలో ఉండేవి.
నిజాం కాలంలో డివిజన్లను సుభాలు అనేవాళ్ళు. జిల్లాలను బందీ లేదా సర్కారు అనేవాళ్ళు. తాలూకాలను పరాగణాలు అనేవాళ్ళు.  సుభాలను మొఘలాయిల పాలనలో ప్రారంభించారు. పరిపాలనా సౌలభ్యం కోసం  సుభాల సంస్కృతిని షేర్షా  మొదలెట్టగా  వాటినే అసఫ్‌ జాహీలు కొనసాగించారు.

✔️ మొత్తం  16 జిల్లాల్లో  8 జిల్లాలు  కర్ణాటక - మహారాష్ట్రలకు సంబంధించినవి. 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి. 
మహారాష్ట్రకు సంబందించి  ఔరంగాబాద్‌ డివిజన్లో - 1)ఔరంగాబాద్‌  (2) బీడ్‌  (3) నాందేడ్‌  (4)పర్భని జిల్లాలు ఉండేవి.
కర్ణాటకకు సంబందించి  గుల్బర్గా డివిజన్లో -
(1) బీదర్‌  (2) గుల్బర్గ  (3)  ఉస్మానాబాద్‌  (4) రాయ్‌చూరు జిల్లాలు ఉండేవి. 

✔️తెలంగాణ ప్రాంతంలో మెదక్‌ - వరంగల్ రెవిన్యూ 
డివిజన్లుగా ఉండేవి. 

*మెదక్ డివిజన్లో - 

(1) మహబూబ్‌నగర్‌  (2)  నల్లగొండ  (3)  నిజామాబాద్‌  (4) మెదక్ జిల్లాలు ఉండేవి.

*వరంగల్ డివిజన్లో - 

(1)ఆదిలాబాద్‌  (2)  కరీంనగర్‌  (3)  వరంగల్‌  (4) ఖమ్మంలోని కొన్నిప్రాంతాలు ఉండేవి.

✔️హైదరాబాద్‌, శివారు ప్రాంతాలను  గుల్షనాబాద్‌ లేదా అత్రాప్‌ బల్ధా  అని పిలిచేవాళ్ళు. . ఇది మొత్తం నిజాం ఆధ్వర్యంలోనే ఉండేది. ఈ శివారు ప్రాంతాల సరిహద్దులు గమనిస్తే.... 
తూర్పున ఏదులాబాద్‌ -దక్షిణాన షాబాద్‌ - పడమర మడమల్‌ - ఉత్తరాన మేడ్చల్‌ వరకు కొనసాగేవి. 

✔️ తాలూకాల వివరాలు గమనిస్తే..... 

మెదక్ సుభాలో 

@ మహబూబ్ నగర్ ప్రాంతానికి  పాలమూరు అనేది పూర్వ నామం. హబూబ్‌నగర్‌ జిల్లాలో మహబూబ్‌నగర్‌ -అమ్రాబాద్‌ -కల్వకుర్తి - మక్తల్‌ - పరిగి - నాగర్‌కర్నూల్‌  తాలూకాలు ఉండేవి

@ నల్లగొండ  పరిధిలో నల్లగొండ -  భువనగిరి -సురయ్యపేట-  హుజూర్‌నగర్‌ - మిర్యాలగూడ -  జనగాం - దేవరకొండ   తాలూకాలు విస్తరించి ఉండేవి.

@  నిజామాబాద్ కు  ఇందూరు అని పిలిచేవారు. ఇందూరు పరిధిలో నిజామాబాద్‌ - కామారెడ్డి - ఎల్లారెడ్డి
బోధన్‌ - ఆర్మూర్‌ -తాలూకాలు ఉండేవి.

 
✔️వరంగల్‌  సుభాలో - 

@ ఆదిలాబాద్‌ పరిధిలో లో భాగంగా ఆదిలాబాద్‌ -  ఆసిఫాబాద్‌ - చెన్నూర్‌ - నిర్మల్‌ - రజురా -లక్సెట్టిపేట - కన్నూట్‌ - సిర్పూర్‌ - ఉట్నూర్‌ -  బోథ్‌ తాలూకాలు ఉండేవి. 
 
 @ కరీంనగర్‌ ప్రాంతాన్ని అప్పట్లో ఎలగందుల అని పిలిచేవారు. ఎలిగందల పరిధిలో  కరీంనగర్‌ జగిత్యాల - హుజురాబాద్‌ - మహదేవ్‌పూర్‌ - పర్కాల్‌ - సిరిసిల్ల ఉస్మాన్‌సాగర్‌ -తాలూకాలు ఉండేవి.

@ వరంగల్‌ - ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు - ములుగు
మహబూబాబాద్‌ -  మధిర -  పాకాల -  పాల్వంచ -   - ఇల్లెందు తాలూకాలు ఉండేవి. 

✔️ గుల్షనాబాద్‌ జిల్లా పరిధిలో -

మెదక్‌ -   భగత  - ఆందోల్‌ - సిద్దిపేట - 
కల్బ్‌సగూర్‌  తాలూకాలు విస్తరించి ఉండేవి.

 నిజాం సొంత జాగీర్‌లో మేడ్చల్‌ - అంబర్‌పేట్‌ -  శంషాబాద్‌ -  ఆసి్‌ఫనగర్‌ - పొట్లూరు  తాలూకాలుగా ఉండేవి. ఇక్కడ పొట్లూరు అనేది పఠాన్ చెరువు ప్రాంతం. 

#పునఃవ్యవస్థీకరణ 

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలను పునఃవ్యవస్థికరించినట్టు 1919లో ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలాఖాన్‌  పరిపాలనాసౌలభ్యం కోసం కొన్ని ప్రాంతాల్లో మార్పులు చేర్పులు అనివార్యంగా కొనసాగించారు. 

#దొరలు_దేశ్ముఖ్_లు 

తాలూకా ప్రాంతాల్లో పల్లెల్ని అధీనంలో ఉంచుకుంటూ దొరలు దేశ్ముఖ్ లు ఉండేవాళ్ళు. దొరలకు కేటాయించే పల్లెల విషయాల్లో నిజాం జోక్యం ఉండేది.దొరతనం అనేది ఒక పదవి.  అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే దొరతనం  
కేటాయించబడేది. పాలించే సామర్థ్యం, పన్నులు వసూలు చేసి రాజు ఖజానాకు తోడ్పడే  శక్తి, ఎవ్వరికైతే ఉంటుందో వాళ్ళకు దొరతనం కట్టబెట్టబడేది. ఒక్కసారి దొరతనం దక్కింది అంటే అది శాశ్వత పదవిగా ఉండేది.  

దొరల్లో కూడా రకాలు ఉండేవి. పెద్దదొరలు, చిన్న దొరలు, వుండేవాళ్ళు. నిజాం రాజ్యంలో పెద్ద దొరలు నలుగురు మాత్రమే. 
1) జన్నారెడ్డి ప్రతాపరెడ్డి 
ఇతడిది మొదటి స్థానం. నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఎర్రపాడు దొర. ఇతడికి 20 గ్రామాల్లో లక్షా యాభై వేల ఎకరాలు పొలం  ఉండేది.  

2)రెండవ స్థానం ఖమ్మం జిల్లా మధిర తాలూకా కల్లూరు దొర. ఇతడికి లక్ష ఎకరాలు పొలం ఉండేది. 

3) రాపాక  వెంకట రామచంద్రారెడ్డి 
వీరిది  మూడవ స్థానం . ఇతడు విసునూరు దేశ్ముఖ్.  ఇతడికి 60 గ్రామాల్లో 45 వేల ఎకురాలు పొలం ఉండేది. 
స్థానం మూడవది అయినా నిజాం వద్ద పెద్ద పలుకుబడి ఉండేది. 

4) నాల్గవ స్థానం సూర్యాపేట దొర. ఇతడికి 20 వేల ఎకరాలు పొలం ఉన్నది.

@ ఈ నలుగురు దొరలు కాకుండా గ్రామాల్లో చిన్నదొరలు  చాలా మంది ఉన్నారు. చిన్నదొరల్లో మళ్ళీ రెండు రకాలు. ఒకటి రెండు గ్రామాలను ఏలే దొరలు కొందరు. పది పన్నెండు గ్రామాలను ఏలే దొరలు కొందరు.  చిన్న దొరలు పెద్ద దొరలకు తొత్తులు. పెద్ద దొరలు నిజాం తొత్తులుగా పాలన సాగుతుండేది
మొత్తానికి  పెద్ద దొరలు ఇప్పటి మన మంత్రులు లెక్క. సామాన్యులకు వాళ్ళ పేరు తప్ప ముఖాలు తెల్వదు. చిన్న దొరలు కూడా సామాన్యం కాదు, ఇప్పటి మన శాసన సభ్యుల లెక్క.

@ ఆనాటి దొరలకు తమ ఇలాఖాలో ఉన్న భూములే పెద్ద ఆస్తులు. ఎక్కడబడితే అక్కడ భూ కబ్జాలు, స్విస్ బ్యాంకుల్లో అకౌంట్స్ , ఇష్టం వచ్చినట్టల్లా గెస్టుహౌసులు, బినామీ ఆస్తులు, వీళ్లకు దాదాపుగా లేవు అనే చెప్పవచ్చు. 

#సంస్థానాలు 

హైదరాబాద్ సంస్థానం అతిపెద్ద సంస్థానం. తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల  14 చిన్న, పెద్ద సంస్థానాలు ఉన్నాయి. 

✔️పెద్ద సంస్థానాలు -

1) అమరచింత - ఆత్మకూరు సంస్థానం 
పెద్ద సంస్థానాల్లో ఇది ఒకటి. 
ముక్కెర గోపాల్ రెడ్డి సంస్థాన వ్యవస్థాపకులు. 

(2) వనపర్తి సంస్థానం 
స్వతంత్ర అధికారాలు కలిగిన పెద్ద సంస్థానం. 
జనుంపల్లి వీరకృష్ణారెడ్డి సంస్థానం మూలపురుషుడు. 

(3) గద్వాల సంస్థానం. 
సొంత అధికారాలు కలిగిన అతిపెద్ద సంస్థానం. 
బుడ్డారెడ్డి సంస్థాన మూలపురుషుడు. ఇతడినే నల్ల సోమనాద్రి అని కూడా పిలుస్తారు. 

(4) పాపన్నపేట సంస్థానం. 
ఇది అతిపెద్ద ప్రాచీన పెద్ద సంస్థానం. ప్రఖ్యాతమైనది. 
రాణీ శంకరమ్మ - సదాశివరెడ్డిల కాలం నుండి సంస్థానచరిత్ర లభ్యం అవుతున్నది. 

(5) దోమకొండ సంస్థానం. 
పెద్ద సంస్థానం. కామినేని కాచారెడ్డి సంస్థాన మూల పురుషుడు. 

(6) పాల్వంచ 
పెద్ద సంస్థానం. అశ్వరావు సంస్థాన మూలపురుషుడు. 

(7) జటప్రోలు 
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పెద్ద సంస్థానం. 
చెవ్విరెడ్డి మూల పురుషుడు. 

(8)మునగాల సంస్థానం. 
ఈ సంస్థానం మూలపురుషుడు గురించి ఇతమిద్ధమైన సమాచారం లేదు. తెలంగాణ ప్రాంతం వారు ఈ సంస్థానాన్ని పాలించారు. 

#చిన్న_సంస్థానాలు 

( 9 )నారాయణపురం - రాజాపేట సంస్థానాలు. 
సొంత అధికారాలు లేని చిన్న సంస్థానం. 
మంచల్ రెడ్డి సంస్థానం మూలపురుషుడు. 

( 10 )బోరవెల్లి సంస్థానం 
మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన చిన్న సంస్థానం. 
తమ్మారెడ్డి సంస్థాన మూలపురుషుడు. 

 అట్లాగే గోపాల్ పేట -  సీర్నాపల్లి - దుబ్బాకుల- దొంతి సంస్థానాలు ఉన్నాయి. వీటిలో గద్వాల, వనపర్తి, 
పాపన్నపేట సంస్థానాలు స్వతంత్ర అధికారాలు కలిగివున్నాయి. 
ఆత్మకూరు  -  దోమకొండ వంటి సంస్థానాలు నిజాం సామంత రాజ్యాలుగా కొనసాగాయి. 

👉ఇది నిజాం రాజ్యం వివరాలు. సంస్థానాలు సంగతి. 
ఆపరేషన్‌ పోలో తర్వాత హైదరాబాద్‌ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. హైదరాబాద్ తో పాటుగా సంస్థానాలు కూడా విలీనం అయ్యాయి. 

 నవంబరు 24,  1949లో హైదరాబాద్‌ రాష్ట్రాన్ని నాలుగు డివిజన్లు 16 జిల్లాలతో కూడిన ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. 

భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1956 నవంబరు ఒకటో తేదీన పెద్దఎత్తున మార్పులు జరిగాయి. గుల్బర్గ పరిధిలోని ప్రాంతాలను కర్ణాటకలోకి  -  ఔరంగాబాద్‌ పరిధిలోని జిల్లాలను మహారాష్ట్రలోకి  కలిపేశారు. ఆ తర్వాత ఇప్పటి తెలంగాణ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలను ఆంధ్ర - రాయలసీమ  ప్రాంతాలతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ప్రకటించారు.